బెంగళూరులో ఫ్లైఓవర్ మీద బైక్- ఇన్నోవా కారు ఢీ, 40 అడుగుల కిందపడి ఆంధ్రా యువకుడి మృతి!
బెంగళూరు/ నెలమంగల: ఫ్లైఓవర్ మీద వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ముందు వెలుతున్న బైక్ ను ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు బైక్ పడటంతో అందులో ప్రయాణిస్తున్న యువకుడు దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైనాయి.
కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!
బెంగళూరు నగరం శివార్లలోని బెంగళూరు - తుమకూరు జాతీయ రహదారి 4 లోని నెలమంగల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తమకూరు వైపు వెలుతున్న బైక్ ను ఫ్లైఓవర్ మీద వేగంగా వెళ్లిన ఇన్నోవా కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైక్ 40 అడుగుల ఎత్తు నుంచి బైక్ కిందకు పడిపోయింది.
ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సంజయ్ కుమార్ (25) అనే యువకుడి తలకు తీవ్రగాయాలై దుర్మరణం చెందాడు. బైక్ లో వెనుక కుర్చుని ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. ప్లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాయులు రికార్డు అయ్యాయని పోలీసులు అన్నారు. సంజయ్ కుమార్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంటీతో 17 ఏళ్ల బాలుడి అక్రమ సంబంధం, బ్లాక్ మెయిల్, నగ్నంగా చేసి నరాలు కట్ చేసి హత్య!
ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ ను అరెస్టు చేసి ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకున్నామని నెలమంగల పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ మీద విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడపం వలనే నిత్యం ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని స్థానికులు ఆరోపించారు.