పేపర్ బాయ్కు సెల్యూట్ చేసిన ఆనంద్ మహింద్రా...! కనిపించని హీరోలంటూ ట్వీట్...!
ముంబై నగరాన్ని వరదలు గత కొద్ది రోజులుగా ముంచెత్తున్న విషయం తెలిసిందే...దీంతో నగరంలో పౌరసేవలు నిలిచిపోయాయి. మోకాలు లోతు నీళ్లతో రోడ్లన్ని జలమయ్యాయి..దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ అగిపోయాయి..రన్వేలు నీటీతో మునిగిపోవడంతో విమాశ్రాయాలను సైతం మూసివేశారు.. ఇక స్కూళ్లకు సైతం సెలవులు ఇచ్చిన పరిస్థితి... ఇన్ని పరిస్థితులు ఉన్నా...తెల్లవారు జామునే ఇంటికి వచ్చే పేపరు మాత్రం ఎక్కడా ఆగలేదు..దీంతో పారీశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా ఇంటికి మాత్రం ఉదయమే ఠంచనుగా న్యూస్ పేపర్ చేరింది..
దీంతో ఇంత పెద్ద వర్షాభావ పరిస్థితుల్లో కూడ పేపరును తన ఇంటికి చేర్చిన పేపర్ బాయ్కి ఆయన సెల్యూట్ చేస్తూ అనంద్ మహింద్రా తన కామెంట్ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈనేపథ్యంలోనే భారీ వర్షాలకు పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు మూత పడ్డాయి...కానీ, మా ఇంటికి న్యూస్ పేపరు మాత్రం సమయానికి వచ్చిందని, అది కూడ భారీ వర్షాలు ఉన్నా తడవకుండా వచ్చిందని పేర్కోన్నారు..దీంతోపాటు ఇది పేపరును అందించిన బాయ్తోపాటు అది చేరేందుకు తెరవెనక ఉన్న హీరోలకు సెల్యూట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు వారు భారీ వర్షాలను సైతం ధైర్యంగా ఎదుర్కోంటున్నారంటూ వ్యాఖ్యానించాడు.
ఇక అనంద్ మహింద్ర లాంటీ వాడు ట్వీట్ చేయడంతో అది ఇప్పటికే వైరల్గా మారింది.దీంతో పలువురు నెటిజన్లు, ఉదయమే పనులు చేసే పలు వర్గాల వారిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు..దాదాపు ఇప్పటికే వేలాదీ మందిగా అనంద్ మహింద్రా పోస్టును లైక్ చేశారు.