వార్నీ ఇదేం కేక్ కటింగ్రా బాబూ: కేక్ పై కూడా పొలిటికల్ రైటింగ్సేనా..!
ముంబై: సాధారణంగా ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ పై ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వారి పేరును రాస్తారు. ఆ తర్వాత బర్త్డే బాయ్ కేక్ కట్ చేసి తనకిష్టమైన వారి నోట్లో కేక్ ముక్క పెడతాడు. ప్రస్తుతం భారత్లో పొలిటికల్ సీజన్ నడుస్తున్నందున ప్రతీ వేడుకను రాజకీయాలతోనే ముడిపెడుతున్నారు మన నాయకులు. ఆఖరికి పుట్టిన రోజు వేడుకను కూడా పాలిటిక్స్తో లింక్ పెడుతున్నారు. లింక్ పెట్టడమే కాదు బర్త్డే కేక్ పై కూడా రాజకీయ సెటైర్లు వేస్తున్నారు.
ఇదిగో ఇక్కడ ఫోటోలో తెల్లచొక్కా వేసుకుని కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆనంద్ పరాంజ్పే. ఈయన కాంగ్రెస్ - ఎన్సీపీల పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా థానే నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం రోజు ఆయన పుట్టిన రోజు. ప్రతీ పుట్టిన రోజు ఎలా జరుపుకుంటారో ఏమో తెలియదు కానీ ఈసారి బర్త్డే మాత్రం కాస్త వెరైటీగా జరుపుకున్నారు. తాను కట్ చేసిన కేక్పై తన పేరు కాకుండా దేశ్ కా చౌకీదారి చోర్ హై అని రాసి ఉన్న కేక్ను కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. కేక్పై ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ రాతలు రాశారు.
2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ పరాంజ్పే శివసేన పార్టీ నుంచి కళ్యాణ్ లోక్సభ స్థానంలో గెలుపొందారు. 2014లో శివసేనను వీడి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శ్రీకాంత్ షిండేపై ఓటమిపాలయ్యారు. ఇక అయ్యగారిపై 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.