వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో ఎపి ఆంధ్రా బ్యాంక్ అధికారిపై దాడి, దోపిడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Andhra bank officer attacked, Rs 5 lakhs looted
ముంబై: ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా బ్యాంక్ అధికారిపై ముంబైలో దాడి జరిగింది. అతని నుంచి ఐదు లక్షల రూపాయలను దాడి చేసి దుండగులు దోచుకెళ్లారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంధ్రా బ్యాంక్ అధికారి సుబ్బారావుపై శుక్రవారం ఉదయం ముంబై రైల్వేస్టేషన్ సమీపంలో దుండగులు దాడి చేసి సుమారు 5 లక్షల రూపాయలను దోచుకెళ్లారు.

దాడిలో గాయపడిన సుబ్బారావును చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. సుబ్బారావు ప్రస్తుతం ముంబైలోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందినవారు.

నగదుతో పాటు సుబ్బారావు విలువైన వస్తువులను కూడా దుండగులు దోచుకెళ్లారు. సుబ్బారావు కోలుకుంటే తప్ప సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని రైల్వే పోలీసులు అంటున్నారు.

English summary
An Andhra Bank PO was attacked near a railway station in Mumbai on Friday and the miscreants snatched away Rs. 5 lakhs cash from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X