చెన్నైలో సీఎం చంద్రబాబు నాయుడు: ఎందుకంటే ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అనంతరం గిండిలోని ఐటీసీ హోటల్ లో ఓ మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో .
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెన్నై చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడికి గ్రేటర్ చెన్నై తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గిండిలోని ఐటీసీ హోటల్ లో ఓ మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు.
హెల్ఫ్: చంద్రబాబుకు లేఖ రాసిన పన్నీర్ సెల్వం, ఎందుకంటే ?
మద్యాహ్నం 12.30 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరుకు బయలేదేరి వెలుతారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. మూడున్నర గంటల పాటు చంద్రబాబు నాయుడు చెన్నైలో ఉంటారని టీడీపీ నాయకులు తెలిపారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యనేతలు చంద్రబాబు నాయుడిని కలుకుంటారని సమాచారం. చంద్రబాబు నాయుడికి చెన్నైలోని టీడీపీకి చెందిన ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.