రూ.100 ఇవ్వలేదని వ్యక్తిని రైలు కింద పడేశాడు
లక్నో: ఓ బిచ్చగాడు తాను అడిగిన వంద రూపాయలు ఇవ్వలేదనే కోపంతో ప్రయాణికుడితో పాటు రైలు కిందకి దూకాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో ని ఫాఫుండ్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఫుండ్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ మీద సర్వేశ్కుమార్ అనే ప్రయాణికుడు రైలు కోసం వేచివున్నాడు. అటుగా వచ్చిన ఓ బిచ్చగాడు సర్వేశ్కుమార్ని రూ.100 ఇవ్వమని అడిగాడు. అందుకు సర్వేశ్ కుమార్ నిరాకరించాడు.
దీంతో ఆగ్రహించిన బిచ్చగాడు సర్వేశ్ని పట్టుకుని అప్పుడే వస్తున్న రైలు కిందకి దూకేశాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
డబ్బివ్వలేదని బిచ్చగాడు సర్వేశ్తో అసభ్యంగా మాట్లాడాడని, అతని ప్రవర్తనకు విసుగుచెందిన సర్వేశ్ సాయం కోసం చూస్తున్నాడని ఇంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టగా ఆ బిచ్చగాడికి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిసింది.