వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.100 ఇవ్వలేదని వ్యక్తిని రైలు కింద పడేశాడు

|
Google Oneindia TeluguNews

లక్నో: ఓ బిచ్చగాడు తాను అడిగిన వంద రూపాయలు ఇవ్వలేదనే కోపంతో ప్రయాణికుడితో పాటు రైలు కిందకి దూకాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ని ఫాఫుండ్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఫుండ్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద సర్వేశ్‌కుమార్‌ అనే ప్రయాణికుడు రైలు కోసం వేచివున్నాడు. అటుగా వచ్చిన ఓ బిచ్చగాడు సర్వేశ్‌కుమార్‌ని రూ.100 ఇవ్వమని అడిగాడు. అందుకు సర్వేశ్‌ కుమార్‌ నిరాకరించాడు.

Angry over denying Rs 100, beggar jumps with man in front of a running train; both dead

దీంతో ఆగ్రహించిన బిచ్చగాడు సర్వేశ్‌ని పట్టుకుని అప్పుడే వస్తున్న రైలు కిందకి దూకేశాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

డబ్బివ్వలేదని బిచ్చగాడు సర్వేశ్‌తో అసభ్యంగా మాట్లాడాడని, అతని ప్రవర్తనకు విసుగుచెందిన సర్వేశ్‌ సాయం కోసం చూస్తున్నాడని ఇంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టగా ఆ బిచ్చగాడికి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిసింది.

English summary
In a shocking incident, a man had to pay with his life when he refused to give Rs 100 to a beggar at a railway station platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X