ఫడ్నవీస్ చర్చలు: నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారే
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే గత ఆరు రోజులుగా చేస్తోన్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. లోక్పాల్ చట్టం తీసుకురావాలని, రైతుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆయన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మార్చి 23న దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గురువారం ఈ దీక్షా శిబిరానికి విచ్చేసి అన్నాతో చర్చలు జరిపారు. వారి మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో ఫడ్నవీస్ అన్నా హజారేకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
#WATCH Shoe hurled at stage while Maharashtra CM Devendra Fadnavis addressed farmers' protest lead by Anna Hazare at Delhi's Ramlila Maidan pic.twitter.com/BmYVWPKazG
— ANI (@ANI) March 29, 2018
ఆరు రోజులుగా దీక్ష చేసిన అన్నా ఐదు కిలోల బరువు తగ్గారని, ఆయన రక్త పోటు పడిపోయిందని హజారే సన్నిహితుడు దత్త ఆవారి తెలిపారు. ఇది ఇలా ఉండగా, సీఎం ఫడ్నవీస్పైకి గుర్తు తెలియని షూ విసిరాడు. అయితే, అది ఆయనకు తగలలేదు.