వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

48 గంటల్లోనే: మరో బీజేపీ సర్పంచ్‌పై ఉగ్రవాదుల కాల్పులు, మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. కాశ్మీర్‌లోని స్థానిక సర్పంచులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా కుల్గాం జిల్లాలోని వెస్సూ ప్రాంతానికి చెందిన సర్పంచ్, బీజేపీ నేత సాజద్ అహ్మద్ ఖాండేపై ఆయన ఇంటి సమీపంలో కాల్పులు జరిపారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రగాయాలపాలైన సాజిద్‌ను వెంటనే అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ(జీఎంసీ) ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాజిద్ ప్రాణాలు వదిలాడు. కాగా, గడిచిన 48 గంటల్లోనే కుల్గాంలో ఇద్దరు సర్పంచులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం గమనార్హం.

Another BJP Sarpanch Shot Dead by Militants in Kulgam, 2nd Attack in Less Than 48 Hrs

ఆగస్టు 4న ఆరీఫ్ అహ్మద్ అనే సర్పంచ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతను తీవ్రగాయాలయ్యాయి. కాగా, ఇతను కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన సర్పంచ్ కావడం గమానర్హం.

కాగా, గత కొంత కాలంగా బీజేపీ, కాంగ్రెస్ సర్పంచులు, నేతలే లక్ష్యంగా ఉగ్రవాదులకు కాల్పులకు తెగబడుతున్నారు. ఉగ్రవాదుల కాల్పులతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

అనేక మంది ఉగ్రవాదులను ఇప్పటికే మట్టుబెట్టామని, కొందరు ప్రతీకారంగా ఈ విధమైన దాడులకు తెగబడుతున్నారని తాజాగా రాజీనామా చేసిన జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జీసీ ముర్ము వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను తుదముట్టించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.

English summary
Another Bharatiya Janata Party sarpanch, Sajad Ahmad Khanday, was shot at by militants outside his residence at Vessu Gazigund area of Kulgam. He later succumbed at a hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X