వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాంకేతిక లోపం: 180 ప్రయాణికులతో వెళ్లిన ఇండిగో ఎయిర్‌బస్ రిటర్న్

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: మరో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో సిలిగురి నుంచి కోల్‌కతా బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యతో టేకాఫ్ అయిన కాసేపటికే సిలిగురిలోని బదోగ్రా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.

సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఈ విమానం టేకాఫ్ అయ్యింది. విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో కొద్దిసేపటికే వెనుతిరిగి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇండిగో ఎయిర్ బస్ ఏ320 నియోలో తరచూ ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.

 Another IndiGo Airbus A320 Neo returns to airport after engine problem mid-air

ఇదే ఇంజిన్ వాడుతున్న పలు ఇండిగో విమానాలు ఇటీవల తరచూ ఇలాంటి సమస్యతోనే ల్యాండ్ అవడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి 31 నాటికి ఇండిగో తన ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాల ఇంజిన్లను సవరించాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ ఇంజిన్ వేరియంట్‌ను అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ వైట్నీ కంపెనీ తయారు చేస్తోందని తెలిసింది. ఇండిగో పోటీదారు అయిన గోఎయిర్ కూడా ఈ కంపెనీకి చెందిన ఇంజిన్లనే వాడుతుండటంతో ఆ సంస్థ విమానాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుండటం గమనార్హం. తక్కువ ధరకే ఇంజిన్లను అందించడంతో విమానయాన సంస్థలు ఈ కంపెనీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

English summary
An IndiGo flight carrying around 180 passengers returned to the Bagdogra airport in West Bengal's Siliguri after developing an engine problem mid-air.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X