ఢిల్లీలో మరో ఈశాన్య రాష్ట్ర యువకుడు మృతి
ఘటన జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మద్యం మత్తులో మెట్ల పైనుంచి పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయని ఓ పోలీసు అధికారి చెప్పారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ అసలు విషయం తెలియదనీ పోలీసు అధికారి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
బుధవారం రాత్రి మణిపూర్ రాష్ట్రానికి చెందిన పిహెచ్డి విద్యార్థి(33) దక్షిణ ఢిల్లీలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇతడు ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే హత్యకు గురయ్యాడు.
మణిపూర్ రాష్ట్రానికే చెందిన మరో 23ఏళ్ల యువకుడు దక్షిణ ఢిల్లీలోని మాల్వియానగర్ ప్రాంతంలో గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా, ఈశాన్య రాష్ట్రాల యువకులపై జరుగుతున్న దాడులపై ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.