నీరవ్ మోడీ ఫ్రాడ్: మరో పిఎన్బీ అధికారి అరెస్టు, పత్రాల స్వాధీనం
Recommended Video
ముంబై: నీరవ్ మోడీ అక్రమాల కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి)కి చెందిన మరో అధికారిని గురువారం అరెస్టు చేశారు. ముంబైలోని చాల్ నుంచి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్కు చెందిన పత్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రెండు బిలియన్ అమెరికా డాలర్ల అక్రమాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బిష్ణుభ్రత మిశ్రా అనే రిటైర్డ్ ఇంటర్నల్ చీఫ్ ఆడిటర్ను అరెస్టు చేశారు పిఎన్బి హౌస్ బ్రాంచ్లో 2011 - 2015కు సంబంధించిన ఆడిట్ వ్యవహారాలను ఆయనే చూశారు.
సిబిఐ కస్టడీలో ఉన్నవారినే కాకుండా మరో 13 మందిని కూడా సిబిఐ అధికారులు గురువారంనాడు ప్రశ్నించారు. అరెస్టయినవారితో పాటు ఇతరులను ప్రశ్నించినప్పుడు వెలువడిన సమాచారం మేరకు మరిన్ని సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ముంబైలోని వాడాల చాల్లోని ఓ చిన్న గదిలో పత్రాలను దాచి పెట్టారు అది నీరవ్ మోడీకి చెందిందని భావిస్తున్నారు. అయితే, అది అతని కంపెనీ పేరు మీద లేదు. తన వ్యాపార కార్యకలాపాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు నీరవ్ మోడీ చెప్పారు.