పాకిస్థాన్ గగనతలం నుండి భారత్ లోకి ప్రవేశించిన కార్గో ఎయిర్ క్రాఫ్ట్
పాకిస్థాన్ గగనతలం నుండి అనుమతిలేకుండా ఏన్ -12 ఎయిర్ క్రాఫ్ట్ బారత భుభాగంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ అధికారులు దాన్ని అడ్డుకున్నారు. బలవంతంగా ఎయిర్ క్రాఫ్ట్ ను జైపూర్ ఎయిర్ ఫీల్డ్ లో దింపారు.
భారత పాకిస్థాన్ యుద్ద వాతవరణం నేపథ్యంలో పాకిస్థాన్ నుండి భారత గగనతలంలోకి ఓ కార్గో విమానం ప్రవేశించింది. కాగా పాకిస్థాన్ భూభాగం నుండి ఎలాంటీ ముందస్తు అనుమతి కూడ లేకుండా భారత భూభాగంలోకి ప్రవేశించిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
#WATCH: Indian Air Force fighter jets force an Antonov AN-12 heavy cargo plane coming from Pakistani Air space to land at Jaipur airport. Questioning of pilots on. pic.twitter.com/esuGbtu9Tl
— ANI (@ANI) May 10, 2019
అయితే ఎట్నోవ్ ఏన్ -12 ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్థాన్ లోని కరాచీ గుండా ఇండియాలోకి ప్రవేశించింది. దీంతో ఆ ఎయిర్ క్రాఫ్ట్ భద్రతా దళాల ఎటీసీ సిగ్నల్స్ కు కూడ స్పందించలేదు. దీంతోపాటు రేడీయో ఫ్రిక్వేన్సికి కూడ స్పందించకపోవడంతో వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు కార్గో విమానాన్ని అడ్డగించారు. షెడ్యుల్ లేని కార్గో ఎయిర్ క్రాప్ట్ జార్జీయా నుండి కరాచీ మీదుగా ఢిల్లీ వెళుతుందని ఢిఫెన్స్ అధికారులు తెలిపారు.
కాగా కొద్ది రోజుల క్రితమే బాలకోట్ దాడి నేపథ్యంలోనే ఇండియా పాకిస్థాన్ లమధ్య ఉధ్రిక్తత వాతవరణం నెలకొన్న విషయం తెలిసింది. ఇలాంటీ పరిస్థితిలో పాక్ భూభాగం నుండి గుర్తు తెలియని విమానం రావడంతో భారత దళాలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన విమానాన్ని దింపి వేశాయి. ఈనేపథ్యంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ద విమానం పాకిస్థాన్ భూభాగంలో పడడంతో పైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి పట్టుబడిన విషయం తెలిసిందే...