శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో ఇక కొత్త అనుభూతి.. విమానం తరహా విలాసవంతమైన సౌకర్యాలు..
చెన్నై: రైలు ప్రయాణికులకు శుభవార్త. దేశంలోనే మొట్టమొదటిసారి విమానంలోని విలాసవంతమైన సౌకర్యాలు శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికులకు కల్పించారు. చెన్నై సెంట్రల్- మైసూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్రయాణికులు శుక్రవారం నుంచి కొత్త అనుభూతి పొందుతారని దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు.
ఈ రైలులో ప్రతీ సీటుకు ఇన్ఫోటెయిన్మెంట్ తెరలు, యూజర్ ఫ్రెండ్లీ స్నాక్ టేబుల్, సౌకర్యవంతమైన సీట్, రెక్నినింగ్ సదుపాయాలు ఉంటాయి. ప్రత్యేకంగా రూ. 3 కోట్ల వ్యయంతో కూడిన కోచ్ ను ప్రయాణికులకు విమాన సదుపాయాలతో పెరంబూర్ సమీకృత కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించారు.
టాయిలెట్లను హ్యాండ్స్-ఫ్రీ పీపాలోహిత వ్యవస్థతో అమర్చారు. రైలు బోగీ తలుపులకు ఆటోమేటెడ్ సెన్సార్-ఎనేబుల్ చేశారు. తలుపులు చూడడానికి స్టార్ హోటల్ ఉన్నమాదిరిగా ఉన్నాయి.
ప్రయాణికుల సీట్ల వద్ద కాలింగ్ బెల్ తో పాటు విలాసవంతమైన సౌకర్యాలు రైలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. చెన్నై నుంచి మైసూరు వెళ్లే ఈ రైలుకు శుక్రవారం నుంచి పచ్చజెండా ఊపారు.