మహిళతో అక్రమ సంబంధమే రోహిత్ ప్రాణం తీసిందా...
యూపి మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ హత్య కోణంలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. రోహిత్ భార్యను విచారిస్తున్న పోలీసులకు ఆమే పలువిషయాలు వెల్లడించింది, ఇతర మహిళతో తిరగడం వల్లే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందని తెలిపింది. ఇద్దరి మధ్య గొడవలో ప్రాణం పోయిందని సింపుల్ గా చెప్పేసింది అపూర్వ .
ఆస్థి కోసం చంపివేసిందని ఆరోపణలు ,పోలీసుల విచారణ ,రోహిత్ శేఖర్ మృతిపై పలు అనుమానాలతో ఆయన భార్య అపూర్వ ను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే , ఆమే ఆస్తికోసమే రోహిత్ ను చంపివేసిందనే ఆరోపణలు ఎదుర్కోంటున్న నేపథ్యంలో ఆమేను గత కొద్దిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. దీంతో పలు కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఈనేపథ్యంలోనే చనిపోవడానికి ముందు ఇద్దరి మధ్య ఘర్షన జరిగిందని తెలిపింది.
వీడియో కాల్ గోడవకు వేదికయింది,
ఏప్రిల్ 15న రోహిత్ ఓ ఫంక్షన్ ఉన్న నేపథ్యంలో డిన్నర్ కు వెళ్లాడు, బాగా ఆలస్యం అయి ,తిరిగి వస్తున్న సమయంలో రోహిత్ భార్య అపూర్వ ఓ వీడియో కాల్ చేసింది, అయితే అప్పటికే రోహిత్ పక్కన మరో మహిళ ఉంది. ఆ మహిళ కనబడకుండా రోహిత్ మేనేజ్ చేసినప్పటికి ఆమే గాజుల చప్పుడు వల్ల మరో మహిళ ఉన్నట్టు అర్థమైంది అపూర్వకు ,దీంతో ఇంటికి వచ్చిన తర్వాత నిలదీయాలని నిర్ణయించుకుంది, అయితే రాత్రి ఇంటికి చేరుకున్న నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వల తో ఆ మహిళ సైతం ఇంటికి చేరుకున్నారు.
మనస్థాపం చెందిన అపూర్వ , గొంతుపై నోక్కి చంపి వేసింది,
కాగా అనంతరం రోహిత్ గదిలోకి వెళ్లిన అపూర్వ ఆయనతో ఘర్షనకు దిగింది. అయితే వేరోక మహిళతో కలిసి ఓకే గ్లాసులో మద్యం సేవించానని రోహిత్ బహిరంగగానే ఒప్పుకున్నట్టు తెలిపింది. దీంతో ఆవేశంతో ఆయన్ను బెడ్ పై పడేసి గొంతుపై ఊపిరాడకుండా చేశానని చెప్పింది. కాగా అప్పటికే రోహిత్ గుండె సంబంధ వ్యాధితో బైపాస్ సర్జరీ కూడ అయింది,మరోవైపు మద్యం సేవించడం తో ఊపిరి ఆడక మృతి చెందినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
చనిపోయాడని తెలిసినా, నాటకాలు ఆడిన అపూర్వ....
తాను గొంతుపై నొక్కడంతో చనిపోయిన రోహిత్ ను వదిలేసి తన గదికి వచ్చింది. ఏమీ తెలియకుండా సాక్ష్యాలు మాయచేసింది. అయితే ఉదయం రోహిత్ కు లేటుగా లేచే అలవాటు ఉండడంతో ఎవ్వరు కూడ ఆయన్ను లేపలేదు, చివరికి మధ్యహ్నం మూడు గంటలకు అపూర్వనే ఇంటి పని మనిషి తో రోహిత్ ను లేపాలని పంపింది .దీంతో రక్తం మడుగులో పడిఉన్న రోహిత్ ను చూసిన గోలు అనే పనిమనిషి అపూర్వను పిలిచాడు. ఏమి తెలియనట్టు అపూర్వ ఆస్పత్రికి సైతం తీసుకెళ్లింది.