భర్త హత్య కేసులో ఎన్డీతివారీ కోడలు అరెస్ట్
ఢిల్లీ : ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఆయన భార్య అపూర్వ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్కు సంబంధించి పోలీసులు మూడు రోజుల పాటు ఆమెను ప్రశ్నించారు. అయితే విచారణలో అపూర్వ నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 16న రోహిత్ శేఖర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా భావించినా ఆ తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే రోహిత్ తల్లి ఉజ్వలా తివారీ ఇష్టం లేని పెళ్లి కావడం, ఆస్తి కోసం తన కొడుకును కోడలు హత్య చేసిందని ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అపూర్వను అరెస్ట్ చేశారు.
ఇష్టంలేని పెళ్లి, ఆస్తిపై కన్ను .. ఇంతలో టచ్లోకి బాయ్ఫ్రెండ్ : రోహిత్ హత్యకు కారణాలివే ?