శుభవార్త:ఈ నెలాఖరులో కొత్త ఉత్పత్తులతో ఆపిల్ ఈవెంట్
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఈ నెలలో కొత్తకొత్త ఉత్పత్తులను వినియోగదారుల ముందుకు తీసుకురానుంది.
వాషింగ్టన్:అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఈ నెలలో కొత్త కొత్త ఉత్పత్తులను వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. ఈ నెలాఖరులో ఆపిల్ ఓ ఈవెంట్ ను నిర్వహించబోతోందని ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రోను లాంచ్ చేయనుంది.
అంతేకాకుండా 128 జీబీ స్టోరేజీతో అతి పెద్ద ఐ ఫోన్ ఎస్ ఈ మోడల్ ను కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్ ను ఆవిష్కరించనున్నట్టు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త ఐ ప్యాడ్ ప్రొ మోడల్స్ ను ఈ నెలలోనే ఆవిష్కరించనున్నట్టు ప్రచారం సాగుతోంది.9.7 అంగుళాల 12.9 అంగుళాల వర్షన్లను అప్ డేట్ చేసిన ఆపిల్ , 10.5 అంగుళాల స్లమిర్ బెజిల్స్ తో ఈ కొత్త ఐప్యాడ్ ప్రొ ను తీసుకురానున్నారని సమాచారం.
అయితే ఈ ఐ ప్యాడ్ ప్రొ లో హొమ్ బటన్ ఉండదట, హై రిజల్యూషన్ డిస్ ప్లే క్వాడ్ మైక్రోపోన్స్ ఉంటాయని ఆపిల్ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.అయితే అప్ డేట్ చేసిన 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12 మెగాఫిక్సెల్ రేర్ కెమెరాను ప్రస్తుతమున్న 9.7 అంగుళాల మోడల్ మాదిరిగా ట్రూ టోన్ డిస్ ప్లే కలిగి ఉంటుందని సమాచారం.
ఓమోలెడ్ డిస్ ప్లే తో 5.8 అంగు సరికొత్త ఐ ఫోన్ ను కూడ లాంచ్ చేయబోతోంది. మిగతా రెండు డివైజ్ లు అప్ డేటేడ్ ఐఫోన్ 7, ఐ ఫోన్ 7 ప్లస్ లని తెలుస్తోంది. అయితే ఆపిల్ ప్రకటించిన ఈ ప్రొడక్ట్ లతో ఈ ఈ వెంట్లోనే వినియోగదారుల ముందకు తీసుకొచ్చే అవకాశం ఉంది.ఈ నెలాఖరులోనే ఈ ఆపిల్ సదస్సు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.