అమ్ ఆద్మీ ఫస్ట్ క్లీనిక్ ప్రారంభం (వీడియో)
న్యూఢిల్లీ: అమ్ ఆద్మీ క్లీనిక్ పేదలకు అందుబాటులో ఉంటుందని, మెరుగైన చికిత్స అందిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అమ్ ఆద్మీ క్లీనిక్ (మొదటి)ను అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్బంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ - మా పార్టీ పేదల పార్టీ అని చెప్పారు. తాము పేదలకు ఎలా దగ్గరగా ఉంటు సేవలు అందిస్తున్నామో ఈ అమ్ ఆద్మీ క్లీనిక్ లు పేదలకు అన్ని విధాల మెరుగైన చికిత్స అందించడానికి అందుబాటులో ఉంటుందని చెప్పారు.
రానున్న రోజులలో మరన్ని అమ్ ఆద్మీ క్లీనిక్ లు అందుబాటులోకి తీసుకువస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తరువాత క్లీనిక్ లోని అత్యాధునిక పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసౌడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ , ఆప్ శాసన సభ్యులు పాల్గొన్నారు.