మార్చి 10-17 తేదీల్లో మీరు ఈ మాల్ వెళ్లారా..? అయితే కార్పొరేషన్ను సంప్రదించండి...
దేశంలో కరోనా వైరస్ కేసులో బయట పడుతూనే ఉన్నాయి. వైరస్ సోకిన వారి నుంచి వెంటనే గుర్తించడం కష్టమవుతోన్న క్రమంలో పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే గత నెలలో చెన్నైలోని షాపింగ్ మాల్లో వైరస్ సోకిన ముగ్గురు పనిచేశారని ప్రభుత్వం పేర్కొన్నది. ఆ సమయంలో మాల్ను సందర్శించిన వారు విధిగా ప్రభుత్వాసుపత్రులు లేదంటే కార్పొరేషన్ను సంప్రదించాలని కోరింది.
చెన్నైలో గల వేళచ్చేరిలో ఫీన్సిక్ మార్కెట్ సిటీ మాల్ ఉంది. వాస్తవానికి ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటోంది. వైరస్ కేసులు పెరుగుతోన్న గత నెల మూడోవారంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే మార్చి 10 నుంచి 17వ తేదీ వరకు మాల్లోని స్టోర్లో వైరస్ సోకిన ముగ్గురు విధులు నిర్వర్తించారు. దీంతో వారు ఎవరిని కలిశారు, సన్నిహితంగా ఉన్నారనే అంశంపై చెన్నై కార్పొరేషన్ దృష్టిసారించింది.
ఆ వారం రోజలు మాల్ను సందర్శంచిన వారు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లానలి సూచించింది. లేదంటే కార్పొరేషన్ను సంప్రదించాలని కోరింది. ఆ సమయంలో మాల్ వెళ్లిన వారు 044-25384520, 044-46122300 ఫోన్ చేయాలని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాశ్ తెలిపారు. మాల్లో పనిచేస్తున్న వారు కూడా తమను సంప్రదించాలని కోరారు. వారికి స్క్రీనింగ్ చేస్తామని.. నెగిటివ్ వస్తే పంపిస్తామని పేర్కొన్నారు.