కశ్మీర్ లోని రంజిత్ సాగర్ ద్యామ్ లో పడిన ఆర్మీ హెలికాఫ్టర్-ప్రమాదంపై అనుమానాలు
జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో ఇవాళ ఓ ఘోర ప్రమాదం చోటు చేసకుంది. సిబ్బందితో వెళ్తున్న ఓ ఆర్మీ హెలికాఫ్టర్ ఇవాళ డ్యామ్ లో కుప్పకూలింది. దీంతో హెలికాఫ్టర్ లో ఉన్న వారంతా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారులు ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
జమ్ముకశ్మీర్ లోని కథువా జిల్లాలో ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారో ఇంకా తెలియరాలేదు. స్ధానిక రంజిత్ సాగర్ డ్యామ్ లో ఈ హెలికాఫ్టర్ కుప్పకూలడంతో ఇందులో ఎంతమంది ప్రయాణించారు, వారిలో ఎంతమంది బతికున్నారనే దానిపై వివరాలు వెల్లడికాలేదు. కుప్పుకూలింది ఆర్మీ హెలికాఫ్టరే అన్న విషయం మాత్రం నిర్ధారణ అయింది.
జమ్మూకశ్మీర్ లోని బసోలీలో ఉన్ పుర్తూ ప్రాంతం నుంచి టేకాఫ్ అయిన ఈ హెలికాఫ్టర్ కొద్ది సమయంలోనే పక్కనే ఉన్న రంజిత్ సాగర్ డ్యామ్ లో కుప్పకూలినట్లు తెలుస్తోంది.. ప్రమాద సమయంలో ఐదుగురు హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఆర్మీ ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రయాణ సమయంలో హెలికాఫ్టర్ లో ఆర్మీ అధికారులే ఉన్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా అన్నది కూడా తెలియరాలేదు. ఆర్మీ ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.