మేజర్ చెబితేనే తీసుకెళ్తున్నా: 2గ్రెనేడ్లతో విమానాశ్రయంలో పట్టుబడ్డ జవాను
తాను మేజర్ చెబితేనే గ్రెనేడ్లు తీసుకెళ్తున్నానని శ్రీనగర్ ఎయిర్పోర్టులో అరెస్టయిన జవాను భూపాల్ ముఖియా తెలిపాడు. సోమవారం జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయంలో ఓ జవాను గ్రెనేడ్లతో విమానం ఎక్కబో
శ్రీనగర్: తాను మేజర్ చెబితేనే గ్రెనేడ్లు తీసుకెళ్తున్నానని శ్రీనగర్ ఎయిర్పోర్టులో అరెస్టయిన జవాను భూపాల్ ముఖియా తెలిపాడు. సోమవారం జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయంలో ఓ జవాను గ్రెనేడ్లతో విమానం ఎక్కబోయిన విషయం తెలిసిందే.
తనిఖీ చేయగా అతడి బ్యాగులో రెండు గ్రెనేడ్లను గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా విచారించారు. అయితే ఈ పనిచేయమని తనను ఓ మేజర్ ఆదేశించారని, ఢిల్లీ వెళ్లాక ఓ వ్యక్తి వీటిని తీసుకుంటాడని చెప్పారని భూపాల్ విచారణలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
కాగా, గ్రెనేడ్లను ఎక్కడ కొన్నారో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అత్యంత భద్రత గల శ్రీనగర్ ఎయిర్పోర్టులో సైనికులు సులువుగా ప్రవేశించొచ్చు. ఈ విమానాశ్రయంలో ఆర్మీ సిబ్బంది ప్రవేశానికి ఎలాంటి తనిఖీలు ఉండవు.
అయితే భూపాల్ కదలికల్లో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని తనిఖీ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ్బెంగాల్లోని డార్జిలింగ్కు చెందిన భూపాల్.. ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. పూర్తి విచారణ తర్యాత అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.