ఆర్టికల్ 35ఏను ముట్టుకుంటే కాలి బుడిదై పోతారు... కేంద్రాన్ని హెచ్చరించిన మహబుబా ముఫ్తి
ఆర్టికల్ 35ఏ ముట్టుకుంటే కేంద్రం కాలి బుడిదవడం ఖాయమని జమ్ము ,కశ్మీర్ మాజీముఖ్యమంత్రి పీడిఎఫ్ అధినేత మహబుబా ముఫ్తి హెచ్చరించారు. కాగా ఈ ప్రక్రియను చేపట్టినట్లయితే తేనే తుట్టేను కదిలించినట్టవుతుందని, ఇది ఒక రకంగా బాంబులతో చెలగాటం అడడమే అని ఆమే తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం శ్రీనగర్లో పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆమే ఘటుగా స్పందించారు.
కశ్మీరీలకు ప్రత్యేక హక్కుల కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏతోపాటు 370ని తొలగించేందుకు కేంద్రం పావులు కదుపుతుందుండడంతో పాటు కశ్మీర్ వ్యాలీలో ఎలాంటీ హింస చెలరేగకుండా ఉండడానికి కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రానికి 10వేల మంది సైనికులను తరలించాని నిర్ణయించింది. కాగా శనివారం కూడ రాజకీయ సమస్యలను భద్రతా దళాలతో పరిష్కరించలేరని ఆమే ట్విట్టర్లో పేర్కోంది.
మరోవైపు కేంద్రం మాత్రం కశ్మీర్పై మరోసారి అతిపెద్ద తీవ్రవాద దాడి జరగబోతుందని అందుకే కేంద్ర బలగాలను ముందు జాగ్రత్త చర్యగా పంపిస్తున్నామని సైనిక బలగాఅ అధికారులు ప్రకటించారు.