370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్ను విడదీయలేరు : అమిత్ షా
పలామ్ : భారత్ నుంచి కశ్మీర్ను విడదీయాలనుకునే పాకిస్థాన్కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సరిహద్దుల్లో టెర్రరిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని రక్షించడంలో రాజీపడబోమన్నారు. ఝార్ఖండ్ లోని పలామ్ జిల్లాలో శనివారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ తిరిగి అధికారంలోకి రాగానే జమ్ముకశ్మీర్కు స్పెషల్ స్టేటస్ కల్పిస్తామన్నారు. ఆర్టికల్ 370 ని బ్యాన్ చేస్తామని ప్రకటించారు.
మోడీ నామినేషన్ వేళ.. వారణాసి మెరిసేలా..! లక్షన్నర లీటర్ల మంచినీరు వృధా..!
దేశభద్రత గురించి ప్రధానంగా ప్రస్తావించారు అమిత్ షా. పాకిస్థాన్ ఆటలు ఇక సాగబోవని.. బుల్లెట్ దెబ్బకు మోర్టార్ బాంబ్ తో సమాధానం చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. గడచిన ఐదేళ్లు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లలేదని చెప్పుకొచ్చారు. ఇటీవల భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సందర్భంగా దేశమంతా హర్షం వ్యక్తం చేస్తే.. కొందరు నేతలు ఆధారాలు చూపమని అడగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.