గంట యాభై నిమిషాలపాటు బడ్జెట్ పై జైట్లీ ఇలా..
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను సమర్పించారు. వరుసుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వరుసగా నాలుగో దఫా బడ్జెట్ ను బుదవారం నాడు ప్రవేశపెట్టారు.ఈ దఫా సాధారణ బడ్జెట్ తోనే కలిపి రైల్వే బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టింది.ఆయన గంట యాభై నిమిషాల పాటు నిరంతరాయంగా బడ్జెట్ పై ప్రసంగించారు.
బడ్జెట్ 2017-18 పూర్తి వివరాలు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ 110 నిమిషాల పాటు నిరవధికంగా ప్రసంగించారు. అయితే అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో అప్పుడప్పడూ కొంత సమయం తడబడ్డారు.అయినా ఆయన ఎలాంటి అంతరాయం లేకుండా తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.
రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్ లో కలిసి ఉండడంతో బడ్జెట్ ను లోక్ సభలో చదివి విన్పించేందుకు సాధారణంగా ప్రతి ఏటా తీసుకొనే సమయం కంటే అరుణ్ జైట్లీ కొంత ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.
గతంలో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం పేరుతో కాకుండా ఈ సారి రంగాల వారీగా బడ్జెట్ ను కేటాయించారు.పూర్తి బడ్జెట్ రూ.21.47 లక్షల కోట్లు, రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లను కేటాయించింది.