ఏకంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణై జైట్లీ నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకంలో భాగంగా గుజరాత్లోని వడోదర జిల్లాలో కర్ణాలి, పిపాలియా, వలీదా, బాగ్లీపురా గ్రామాలను దత్తత తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు.
ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై స్వాతంత్య దినోత్సవ ప్రసంగం సందర్బంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ పథకం ద్వారా ఎంపీలు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం తగిన నిధులను కేటాయిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆరు లక్షల గ్రామాల్లో 2019 కల్లా సుమారు 2,500 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది మోడీ సంకల్పమని గుర్తు చేసుకున్నారు.
Today
I
adopted
villages
in
the
Karnali
gram
panchayat
in
Vadodara,
Gujarat
as
part
of
the
Sansad
Adarsh
Gram
Yojna
pic.twitter.com/ckgN8Qgvwi
—
Arun
Jaitley
(@arunjaitley)
January
11,
2015
Participating
in
Swachh
Bharat
Abhiyan,
at
village
Karnali
of
Dabhoi
taluka
in
Vadodara,on
11
Jan,
2015
pic.twitter.com/EbX7LYyuJq
—
Arun
Jaitley
(@arunjaitley)
January
11,
2015