జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలు
మాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా జైట్లి కుమారుడు చితికి నిప్పంటించారు. అంతకు ముందు ఆయన స్వగృహం నుండి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు,మంత్రి అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ఇతర పార్టీ ముఖ్య నేతలు నివాళులు అర్పించారు.
నిగంబోధ్కు ఘాట్కు కూడ ఆయన్న చివరిసారిగా చూసేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు మంత్రులు నాయకులు,కార్యకర్తలు,కుటుంభ బంధువులు, స్నేహితులు చేరుకున్నారు, ఈనేపథ్యంలోనే రాజకీయ కురువృద్దురు ఏల్కే అద్వాని సైతం ఆయన కుతూరు సహయంతో నిగంభోద్కు చేరుకుని నివాళులు అర్పించారు.
ఈ నెల 9వ తేదీ నుండి చికిత్స పోందుతున్న జైట్లీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శనివారం మధ్యాహ్నం 12.07 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా గత సంవత్సర కాలంగా ఆయన కిడ్నీలతోపాటు కేన్సర్ వ్యాధితో భాదపడ్డారు. కాగా ఆయన మృతిపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విదేశాల్లో మోడీ అరుణ్ జైట్లీ కుటుంభ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధితో పాటు పలు పార్టీల నేతలు ఆయనకు నివాళులు అర్పించారు.