బస్తీ మే సవాల్: 24 గంటల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించండి: అరవింద్ కేజ్రీవాల్
మరో నాలుగురోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండగా మాటలయుద్దం తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం తన మేనిఫెస్టోను ప్రకటించిన కేజ్రీవాల్.. బీజేపీపై విమర్శలకు మరింత పదునుపెట్టారు. సీఎం అభ్యర్థిని ప్రకటించని బీజేపీ.. కబుర్లు చెప్తుందని విమర్శించారు. దమ్ముంటే బుధవారం లోగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
కేజ్రీవాల్ డెడ్లైన్..
బుధవారం మధ్యాహ్నం 1 గంటలోపు బీజేపీ తమ సీఎం అభ్యర్థని ప్రకటించాలని కోరారు. క్యాండెట్ ఎవరో చెబితో సదరు నేతతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ చేశారు. తన సవాల్ను బీజేపీ స్వీకరించని పక్షంలో తానే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అంతేకాదు ఢిల్లీ ప్రజలు కూడా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియజేయాలని కోరాలని కేజ్రీవాల్ సూచించారు.
యోగి ఫైర్
మరోవైపు కేజ్రీవాల్ కామెంట్లపై అంతుకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిచారు. ఢిల్లీ వీధుల్లో తనను ప్రచారం చేయనీయకుండా అడ్డుకొనేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎందుకంటే షహీన్ బాగ్ అల్లర్లకు కారణమెవరో అందిరికీ తెలుసు అని మాట్లాడారు. సీఏఏ కాదు, కశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370, వివాదాస్పద భూమి అయోధ్య స్థలంపై కూడా వారు ఇదే అభిప్రాయంతో ఉన్నారని గుర్తుచేశారు.
ఆప్కు అనుకూలం..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య డైలాగ్ వార్ పీక్కి స్టేజీకి చేరిన టైమ్స్ నో పోల్ సర్వే వివరాలను వెల్లడించింది. సర్వే ప్రకారం ఆప్ 54 నుంచి 60 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నది. బీజేపీ 10-14, కాంగ్రెస్ 2 సీట్లు గెలవబోతుందని తెలియజేసింది. టైమ్స్ నౌ సర్వే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరింత బూస్ట్నిచ్చింది.