వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేజ్రీవాల్ రిజైన్ చేయాలని 34 మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు'

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి తజిందర్‌ పాల్‌ బగ్గా తెలిపార

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి తజిందర్‌ పాల్‌ బగ్గా తెలిపారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఏఏపీ ఓడిపోతే కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని 34 మంది ఆమ్‌ ఆద్మీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలిసిందని ట్వీట్ చేశారు.

ఎగ్జిట్ పోల్: మోడీ హవా, ఢిల్లీలో మూడింట బీజేపీదే గెలుపు, కేజ్రీ ట్వీట్!ఎగ్జిట్ పోల్: మోడీ హవా, ఢిల్లీలో మూడింట బీజేపీదే గెలుపు, కేజ్రీ ట్వీట్!

Arvind Kejriwal must quit as Delhi chief minister after the civic polls: BJP leader

ఏప్రిల్‌ 23న ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 270 వార్డులకు పోలింగ్‌ జరగగా.. ఇందులో 200లకు పైగా స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేస్తుందని రెండు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

అయితే కేజ్రీవాల్‌ మాత్రం వీటిని కొట్టి పారేశారు. ఏఏపీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. అంతేగాక, ఒకవేళ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమైతే మళ్లీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమం నుంచే ఆమ్‌ ఆద్మీ పార్టీ పుట్టిందని, మళ్లీ తన మూలాలకు వెళ్లడానికి పార్టీ సంకోచించదన్నారు.

English summary
Arvind Kejriwal must quit as Delhi chief minister after the civic polls, says BJP leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X