ప్రజాతీర్పును అంగీకరిస్తున్నాం..స్మృతీ ఇరానీకి అభినందనలు: రాహుల్
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఓటమిపై కారణాలు వెదకటం లేదని ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తున్నామని అన్నారు. ఇక తన సొంత నియోజకవర్గం అమేథీలో ఓటమిపాలైన రాహుల్ గాంధీ అక్కడ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు చెప్పారు. తనపై పోటీచేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థిని స్మృతీ ఇరానీకి అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీ.
దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!
ప్రజలే దేవుళ్లు అని తన ప్రచారంలో చెప్పానని గుర్తుచేసిన రాహుల్ గాంధీ... ఆ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి అభినందనలు తెలిపారు. అయితే తమ ఓటమికి కారణాలు ఏమిటో విశ్లేషించాల్సిన రోజు ఈ రోజు కాదన్న రాహుల్ గాంధీ...ప్రజలు నరేంద్ర మోడీని తిరిగి ప్రధాని చేయాలని నిర్ణయించికున్నందున ఒక భారతీయుడిగా వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు .
మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కూడా ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిపాలైనప్పటికీ... కేరళలోని వాయనాడులో నాలుగు లక్షల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు.
#WATCH live from Delhi: Congress President Rahul Gandhi addresses the media. #ElectionResults2019 https://t.co/rCRUWymSAz
— ANI (@ANI) May 23, 2019