వీడియో కవరేజ్ లేదని లేచి వెళ్లిపోయిన వధువు
తిరుచ్చి: పెళ్లి కొడుకు తరఫు వారు వీడియో గ్రాఫర్ను పెట్టలేదని పెళ్లి పీటల మీద నుంచి లేచింది ఓ పెళ్లి కూతురు. ఈ సంఘటన తిరుచ్చి సమీపంలోని తురాయుర్లో ఆదివారం నాడు చోటు చేసుకుంది. వీడియో గ్రాఫర్ను ఏర్పాటు చేయలేదని వధువు బంధువులకు ఆగ్రహం వచ్చింది.
సెంథిల్కు తన బంధువు కుమార్తెను (నిన్న) ఆదివారం నాడు వివాహం జరిపించాలని నిర్ణయించారు. పెళ్లి కోసం సెంథిల్ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమయం దగ్గర పడుతుండడంతో వధూవరులిద్దరూ పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు.
పెళ్లి వేడుకను ఓ ఫోటో గ్రాఫర్ మాత్రమే కవర్ చేస్తుండటంతో వధువు తండ్రి, ఇద్దరు కొడుకులకు.. వీడియో గ్రాఫర్ ఎక్కడ అనే అనుమానం వచ్చింది. దీనిపై వరుడి తండ్రిని ప్రశ్నించారు. పెట్టలేదని సమాధానం చెప్పాడు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు పెళ్లి వేదిక నుంచి వచ్చేసింది.
దీంతో, ఈ ఘటనపై వరుడు సెంథిల్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తమను చీటింగ్ చేశారని, అనవసరంగా తమ డబ్బులు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వధువు, వరుడి కుటుంబాలు దగ్గరివే కావడం గమనార్హం. కాగా, సెంథిల్(32) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. వధువు రేవతి (30). వధువు తండ్రి స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్లో ఉద్యోగి.