మరో జాకిర్ నాయక్ అసదుద్దిన్ ఓవైసీ ....!
ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీపై మరోసారి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో విరుచుకుపడ్డారు. ఓవైసీ మరో జకిర్ నాయక్లా తయారవుతున్నారని ఆయన ఆరోపించారు. ఓవైసీ అతిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన హెచ్చరించారు.
కాగా అయోధ్య తీర్పు తర్వాత ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఉన్నతమైనదే అంటూ ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా తాము అడుక్కునే స్థాయిలో లేమని తమ పోరాటం భూమి కోసం కాదని మసీదు కోసమే తమ న్యాయపోరాటమని ఆయన చెప్పారు. దీంతో సుప్రీం కోర్టు వ్యాఖ్యలను కూడ ఆయన ఉద్ఘటించారు.
ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించినట్టు ఆధారాలు కూడ లేవని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని ఓవైసీ వివరించారు. తీర్పు అనంతరం ఓవైసీ మా మసీదు మాకు కావాలంటూ ట్వీట్ చేశారు. దీంతో కేంద్రమంత్రి బాబు సుప్రియో ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే పలువురు బీజేపీ నేతలు, మంత్రులు సైతం ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే ఓవైసీ వ్యాఖ్యల తర్వాతా కూడ సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడ ముస్లీం పర్సనల్ లాబోర్డు నిరాకరించిన విషయం తెలిసిందే...