ఫోర్బ్స్ సర్వే: అవినీతిలో భారత్ నెం.1, కానీ మోడీపై ప్రశంసలు
అవినీతిలో ఆసియా దేశాల్లో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆసియా దేశాల్లో మన దేశంలోనే ఎక్కువ శాతం అవినీతి జరుగుతోందని ఫోర్బ్స్ ఆర్టికల్ పేర్కొంది.
న్యూఢిల్లీ: అవినీతిలో ఆసియా దేశాల్లో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆసియా దేశాల్లో మన దేశంలోనే ఎక్కువ శాతం అవినీతి జరుగుతోందని ఫోర్బ్స్ ఆర్టికల్ పేర్కొంది.
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తన సర్వే నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించింది. అవినీతిని రూపుమాపాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న లక్ష్యాలను అందుకోవాలంటే ఇంకా ఆ దేశం చాలా ముందుకు వెళ్లాల్సి ఉందని ఆ నివేదిక పేర్కొన్నది.
ఆసియాలో ఉన్న ఫైవ్ మోస్ట్ కరప్ట్ కంట్రీస్ జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఆసియా దేశాల్లో లంచాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదికలో తెలిపింది. భారత్ తర్వాత వియత్నాం, థాయ్లాండ్, పాకిస్థాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి.
భారత్లో అవినీతి 69 శాతం ఉందని పేర్కొంది. ఆ తర్వాత వియత్నాంలో 65 శాతం లంచాలు ఇస్తేనే పనులు జరుగుతాయని పేర్కొంది. థాయ్లాండ్లో41 శాతం, పాకిస్థాన్లో 40 శాతం, మయన్మార్లో 40 శాతం అవినీతి ఉందని పేర్కొంది.
భారత్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, ఐడీ డాక్యుమెంట్లు, పోలీసులు, సేవల రంగాల్లో లంచం మరీ ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే అవినీతిని అంతం చేసేందుకు పోరాటం చేస్తున్న ప్రధాని మోడీపై ఆ నివేదిక ప్రశంసలు కురిపించింది.