నీ రేటెంత అని అడిగిన పోకిరీలను పట్టించిన మోడల్
ముంబై: తన రేటును అడిగిన యువకులను ఓ మోడల్ పోలీసులకు పట్టించిన సంఘటన ముంబైలో జరిగింది. ముంబైకి చెందిన మోడల్ పూర్ణిమ.. బాంద్రాలోని బస్టాండు బెంచీ పైన కూర్చుంది. ఈ సందర్ఙంగా ఇద్దరు బాక్సర్లు వచ్చి వేధించారు.
ఒక రోజు రాత్రి తమతో గడిపేందుకు కావాలని, రేటు ఎంత అని అడిగారు. వారి మాటలతో భయాంతోళనకు గురైన మోడల్ అరిచింది. దీంతో వారు పారిపోయారు. వారి పారిపోతుండటాన్ని గమనించిన మోడల్ వెంబడించింది. అనంతరం పోలీసులకు పట్టించింది.
నటి కావాలన్న కోరికతో ఆరేళ్ల నుంచి మోడల్గా పని చేస్తూ... కువైట్, దుబాయ్, యూఏఈ తదితర దేశాల్లో జమ్మూకు చెందిన పూర్ణిమ రాణిస్తోంది. గతంలో నార్త్ ఇండియా టీన్ క్వీన్ అవార్డు లభించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసిన మ్యూజిక్ వీడియోల్లో నటించి పేరు తెచ్చుకుంది.
అవకాశాల కోసం ముంబైలో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల రాత్రి 10:30 గంటల సమయంలో జాగింగ్ చేస్తూ.. అలసిపోయి కూర్చుంది. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడ చాలామంది కూడా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు.
సాయం కావాలా అని అడిగాడు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చాడు. ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు. పూర్ణిమ భయపడింది. అతను మాట్లాడుతూ... తనతో రాత్రి గడపాలని, నీ రేటు ఎంత అని అడిగాడు. పూర్ణిమ సాయం కోసం కేకలు వేసింది. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు.
వారు ఆటోలో పారిపోతుండటంతో.. ఆమె మరో ఆటోలో వారిని అనుసరించింది. పోకిరీలు వెళ్తున్న ఆటో సెయింట్ ఆండ్ర్యూస్ చర్చ్ రోడ్లోకి ప్రవేశించగానే.. అక్కడ పోలీసు నాకాబందీ జరుగుతోందని గమనించిన పూర్ణిమ, పోలీసులకు విషయం తెలిపింది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు రెండో నిందితుడి కోసం గాలిస్తున్నారు.