హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పైలట్ అవుదామని వెళ్లి ... మృత్యు ఒడిలోకి .. న్యూజిలాండ్ కాల్పుల్లో మరొక హైదరాబాదీ మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పైలట్ కావాలనే ఆ యువకుడి ఆకాంక్షను శ్వేతజాతియుడి జాత్యాంహకారం బలితీసుకుంది. ఆ యువకుడి ఆశలను మానవమృగం నిర్దాక్ష్యిణంగా చిదిమిమేసింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ మసీదుల్లో దుండుగులు జరిపిన కాల్పుల్లో 50 మంది ఆసువులు బాశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన మరోకరిని గుర్తించారు.

పైలట్ అవుదామని వెళ్లి ...

పైలట్ అవుదామని వెళ్లి ...

హైదరాబాద్‌లోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన ఒజైర్ ఖదీర్ (25) పైలట్ కోర్సు చదివేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. క్రైస్ట్ చర్చిలోని పైలట్ అయ్యేందుకు కమర్షియల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఎప్పటిలాగే గత శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు మసీదుకు వెళ్లాడు. కానీ శ్వేత జాత్యాంహకారం రూపంలో మృత్యువు కదలిరావడంతో .. తూటాలకు బలయ్యాడు. మసీదులో కాల్పులు జరిపిన తర్వాత ఖదీర్ పేరు మృతుల, క్షతగాత్రుల జాబితాలో లేదు. ఆ తర్వాతే ఖదీర్ కూడా చనిపోయినట్టు నిర్ధారించారు.

అన్నే ప్రేరణగా ..

అన్నే ప్రేరణగా ..

ఖదీర్ పైలట్ కావడానికి అతని అన్న ఒమర్ ఖదీర్ ప్రేరణ. సింగపూర్ కమర్షియల్ పైలట్‌గా పనిచేస్తున్నాడు ఒమర్. దీంతో తాను కూడా పైలట్ కావాలనే ఆకాంక్షతో న్యూజిలాండ్ వచ్చి .. పైలట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కానీ అంతలోనే విధి కబలించింది. ప్రార్థనలు చేస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఒజైర్ చనిపోయాడు.

నిన్న న్యూజీలాండ్..నేడు నెదర్లాండ్స్ ! మరో ఉగ్ర ఘాతుకం..ప్రయాణికులపై కాల్పులు!నిన్న న్యూజీలాండ్..నేడు నెదర్లాండ్స్ ! మరో ఉగ్ర ఘాతుకం..ప్రయాణికులపై కాల్పులు!

తెలంగాణకు చెందిన మూడో వ్యక్తి బలి

తెలంగాణకు చెందిన మూడో వ్యక్తి బలి

మసీదుల్లో దుండగుడు సృష్టించిన నరమేధంలో ఖదీర్ మృతితో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఫర్హాజ్ అహ్‌సన్, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ కూడా కాల్పుల్లో మృతిచెందారు. కానీ వీరి పేర్లను అధికారులు చనిపోయిన వారి జాబితాలో చేర్చలేదు. అహ్‌సన్ స్వస్థలం కూడా హైదరాబాద్ కాగా .. ఆయన న్యూజిలాండ్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇమ్రాన్‌ఖాన్ స్వస్థలం కరీంనగర్ కాగా .. ఆయన న్యూజిలాండ్‌లో రెస్టారెంట్‌లో పనిచేసేవారు. అహ్‌సాన్ మ‌‌ృతదేహం తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు ఇప్పటికే న్యూజిలాండ్ బయల్దేరి వెళ్లారు. ఖాన్ తల్లిదండ్రులు కూడా న్యూజిలాండ్ వెళ్లారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన అహ్మాద్ ఇక్బాల్ జహంగీర్ గాయపడ్డారు.

English summary
Ozair Khadir, 25, a resident of Noor Khan Bazar area in the old city here, was in the list of Indians named by the Indian High Commission in New Zealand as those who died in the Christchurch attack. Farhaj Ahsan and Mohammed Imran Khan are the other two men from Telangana killed but their names did not figure in the list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X