వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏబీపీ-సీ ఓటర్ సర్వే : అసోంలో మళ్లీ బీజేపీదే అధికారం... ఎన్ని సీట్లు వస్తాయంటే...

|
Google Oneindia TeluguNews

అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ-సీ ఓటర్ సర్వే వెల్లడైంది. సర్వే ప్రకారం అసోంలో మరోసారి బీజేపీనే అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. మొత్తం 43.8 శాతం ఓట్లు,72 సీట్లతో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

అదే సమయంలో కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ కూటమి 41.4శాతం ఓట్లతో కేవలం 47 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. బీపీఎఫ్‌కు 4 సీట్లు,ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీయే కూటమి అసోంలో 41.9శాతం ఓటింగ్‌తో 74 సీట్లు సాధించగా... కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ 31శాతం ఓట్లతో 26 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. గతం కన్నా యూపీఏ ఓటింగ్ పెరిగినప్పటికీ సీట్లు మాత్రం పెద్దగా పెరిగే అవకాశం లేనట్లు వెల్లడైంది.

assam assembly elections 2021 abp c voter survey reveals BJP Expected to get 68-76 Seats

కాగా,అసోంలో మార్చి 27,ఏప్రిల్ 1,ఏప్రిల్ 6 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఈ-నామినేషన్లకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఓటింగ్ సమయంలో ఓటర్లకు హ్యాండ్ గ్లవ్స్,ముఖానికి మాస్కులు ఇవ్వనున్నారు.

అసోంతో పాటు తమిళనాడు,పుదుచ్చేరి,కేరళ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఒపీనియన్స్ పోల్స్‌ను కూడా ఏబీపీ-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. బెంగాల్‌లో టీఎంసీ,తమిళనాడులో డీఎంకె,పుదుచ్చేరిలో బీజేపీ,కేరళలో ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

English summary
The ABP Network-C Voter survey has predicted BJP led NDA alliance to register huge victory with at least 72 seats. As per the survey, the saffron party led alliance is likely to secure 43.8 per cent vote share.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X