డిప్యూటీ స్పీకర్ ఎక్కగానే పరుగెత్తిన ఏనుగు, అంబారీ పైనుంచి కిందపడ్డ నేత(వీడియో)
Recommended Video
డిస్పూర్: అసోం డిప్యూటీ స్పీకర్ కృపానాథ్ మల్లా సోమవారం నాడు ప్రమాదంలో ఏనుగు పై నుంచి కిందపడ్డారు. అతను ఇటీవలే డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. అతను తన సొంత నియోజకవర్గం రటబరికి వెళ్లినప్పుడు అతని మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
ఏనుగు అంబారీపై ఊరేగించి తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అతనిని ఏనుగుపై ఎక్కించారు. అయితే ఏనుగుపై కూర్చున్న అతను మధ్యలో కిందపడిపోయారు. ఈ సంఘటన కరీంగంజ్ జిల్లాలోని రటబరి నియోజకవర్గంలో జరిగింది.
కృపానాథ్ అక్టోబర్ 5న అసోం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. కృపానాథ్ కరీంగంజ్ జిల్లాలోకి రాగానే ఆయనను అంబారీ ఎక్కించారు. ఆయన ముందు మావటి వాడు కూడా కూర్చున్నాడు. అయితే ఏనుగు హఠాత్తుగా ముందుకు పరుగెత్తడంతో కిందపడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనలో కృపానాథ్కు ఎలాంటి గాయాలు కాలేదు.
#WATCH: Newly-elected deputy speaker of Assam assembly Kripanath Mallah falls off an elephant. He was being welcomed by his supporters in
— ANI (@ANI) October 8, 2018
Ratabari, his own constituency, in Karimganj district. The deputy speaker was unhurt in the incident. (06.10.2018) #Assam pic.twitter.com/2UYHkS7zvx