అసోంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్,సజీవ దహనం
గోహతి:అస్సాంలోని నాగామ్ జిల్లాలో మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా నిందితులు ఆ బాలికను సజీవ దహనం చేశారు.
అస్సాం రాష్ట్రంలోని నాగామ్ జిల్లాలో స్కూల్ నుండి ఇంటికి వచ్చిన మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. ఐదుగురు నిందితులు ఇంట్లో ఒంటరిగా బాలిక ఉందనే విషయాన్ని గుర్తించారు.
బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. అంతేకాదు బాలిక బతికుంటే తమ బండారం బయటపడుతోందని భావించారు.దీంతో బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90శాతం కాలిపోయిన బాలికను స్థానికులు వెంటనే ఆసుపత్రిలోకి తరలించారు.
అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడ ఉన్నారు. వీరిద్దరూ కూడ మృతురాలితో కలిసి చదువుకొంటున్నవారే. అయితే బాలిక మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.