వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చమురు బావిలో భారీగా ఎగిసిన మంటలు: ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు

|
Google Oneindia TeluguNews

గౌహతి: అస్సాంలోని తిన్సుకియా జిల్లా బాఘ్జన్‌లో ఆయిల్ ఇండియా సంస్థ(ఓఐఎల్) చమురు బావిలో తాజాగా మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు కంపెనీ సీనియర్ మేనేజర్ జయంత బర్ముడోయి వెల్లడించారు.

కాగా, గత నెల రోజుల నుంచి ఈ బావిలో తరచూ మంటలు ఎగిసిపడుతుండటం గమనార్హం. ఈ మంటలను అదుపులో చేసే క్రమంలోనే ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Assam: Huge explosion near Baghjan oil well, 3 foreign experts injured

మే 28 నుంచి ఈ చమురు బావిలో గ్యాస్ లీకవుతోంది. కాగా, జూన్ 9 నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలను అదుపులో చేసే ప్రయత్నంలో ఇప్పటికే ఇద్దరు ఫైరింజిన్ సిబ్బంది మరణించారు .

Recommended Video

Bhutan కూడా India పై కయ్యానికి దిగితే? 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నదీ జలాల అడ్డగింత ఎవరి పని ?

ఈ క్రమంలో విదేశాల నుంచి నిపుణులను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నం కూడా తాజా ప్రమాదంతో తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ లీకవడం ,మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

English summary
Three foreign experts were injured in an explosion which occurred near Oil India Limited (OIL)’s gas well number 5 at Baghjan, in Assam’s Tinsukia district on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X