దారుణం: కట్నం కోసం నవ వధువుపై స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్రేప్
గోహతి: అడిగినంత కట్నం ఇవ్వలేదనే కారణంగా పెళ్ళైనా మూడు రోజులకే నవ వధువుపై స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం చేసిన ఘటన అసోం రాష్ట్రంలో చోటు చేసుకొంది. బంగారు ఆభరణాలు ఇవ్వలేదనే నెపంతో భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు.
పెళ్ళైనా మూడు రోజులకే కట్టుకొన్న భర్తే కట్నం ఇవ్వలేదనే భార్యపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతొంది.
కదిలేకారులో మైనర్పై గ్యాంగ్రేప్, నిందితుల్లో దూరపు బంధువు
అసోం రాష్ట్రంలోని కరీంగంజ్లో ఏప్రిల్ 17న ఈ ఘటన చోటు చేసుకొంది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఈ విషయం వెలుగు చూసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆభరణాలు కట్నంగా ఇవ్వలేదని రేప్
అసోం రాష్ట్రంలోని కరీంగంజ్లో ఏప్రిల్ 14వ తేదిన ఓ యువతిని ఓ వ్యక్తి వివాహం చేసుకొన్నాడు. వివాహం సందర్భంగా బంగారు ఆభరణాలను కట్నంగా ఇవ్వాలని అత్తింటివారిని డిమాండ్ చేశారు. అయితే వారు పెళ్ళి సమయంలో కట్నంగా బంగారు ఆభరణాలను ఇవ్వలేదు. దీంతో ఏప్రిల్ 17న తన స్నేహితులతో కలిసి భార్యపై ఆ వ్యక్తి గ్యాంగ్రేప్కు పాల్పడ్డాడు.
కట్నం కోసమే దారుణం
పెళ్ళి సమయంలో కట్నం కింద ఇచ్చే బంగారు ఆభరణాల విషయమై భర్త తన పుట్టింటి వారితో ప్రస్తావించినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.అయితే సమయానికి బంగారు ఆభరణాలను సమకూర్చలేకపోయినట్టు ఆమె చెప్పింది. బంగారు ఆభరణాలను సమయానికి సమకూర్చని కారణంగానే తనపై దారుణానికి పాల్పడినట్టుగా బాధితురాలు చెప్పారు.
ఆసుపత్రిలో బాధితురాలు
బంగారు ఆభరణాలను కట్నంగా ఇవ్వలేదనే అక్కసుతో ఇద్దరు స్నేహితులతో కలిసి భర్త నవ వధువుపై అత్యాచారం చేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందునే ఈ విషయం వెలుగు చూసింది.ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకొంటుంది
భర్త అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు
నవ వధువుపై గ్యాంగ్రేప్కు పాల్పడిన నిందితుల్లో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడి ఇద్దరు స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో రోజు రోజుకు అత్యాచార కేసులు ఎక్కువగా నమోదు కావడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అసోం రాష్ట్రంలోని కరీంగంజ్లో ఏప్రిల్ 17న ఈ ఘటన చోటు చేసుకొంది.