ఆ ఎమ్మెల్యేల ఆస్తులు ఐదేళ్లలో 82 శాతం పెరిగాయి
యూపీలో 311 మంది ఎమ్మెల్యేలు మరోసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. ఈ ఎమ్మెల్యేల ఆస్తులు గత అయిదేళ్లలో 82 శాతం పెరిగాయి. వీరి ఆస్తులు సరాసరిగా రూ.2.84 కోట్లు మేర పెరిగాయి.
లక్నో: యూపీలో 311 మంది ఎమ్మెల్యేలు మరోసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. ఈ ఎమ్మెల్యేల ఆస్తులు గత అయిదేళ్లలో 82 శాతం పెరిగాయి. వీరి ఆస్తులు సరాసరిగా రూ.2.84 కోట్లు మేర పెరిగాయి.
2012లో గెలుపొందిన 311 మంది ఎమ్మెల్యేలు ఈసారి బరిలోకి దిగారు. వీరి ఆస్తులు 2012లో సరాసరిగా రూ.3.49 కోట్లుగా ఉన్నాయి. ఇప్పుడు వారి ఆస్తులు రూ.6.33 కోట్లకు పెరిగాయి.
యూపీ బీజేపీ వైపు?: అఖిలేష్ తప్పటడుగు అక్కడే
యూపీ ఎన్నికల నిఘా సంస్థతో కలిసి ఆయా అభ్యర్థుల ఆస్తుల వివరాలను విశ్లేషించడం ద్వారా ఈ వివరాలు వెల్లడించారు. తిరిగి పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలలో బీఎశ్పీ నేత షా ఆలం ఉర్ఫఅ జమాలి అత్యధికంగా ఆస్తులు కూడబెట్టారు.
2012 నుంచి 2017 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఏకంగా రూ.64 కోట్లు పెరిగాయి. ఆయన తర్వాత మరో బీఎస్పీ ఎమ్మెల్యే నవాబ్ కరీం అలీ ఖాన్ ఆస్తులు ఏకంగా రూ.40 కోట్లు పెరిగాయి. తదుపరి స్థానంలో బీఎస్పీ ఎమ్మెల్యే అనూప్ కుమార్ ఉన్నారు.
ఆయన ఆశ్తులు రూ.35 కోట్లు పెరిగాయి. పార్టీల ప్రకారం చూసుకుంటే ఎస్పీకి చెందిన 162 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ.2 కోట్లు మేర పెరగగా, బీఎస్పీకి చెందిన 57 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.4 కోట్ల మేర పెరిగాయి. బీజేపీకి చెందిన 55 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.2 కోట్ల మేర పెరగగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ.2 కోట్ల మేర పెరిగాయి.