వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిపై కామాంధుల కన్ను, తమ్ముడి హత్య, బాలిక, ఆమె తల్లి మీద, దారుణంగా!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో ఘోరం జరిగింది. దళిత కుటుంబంపై దాడి చేసిన కామాంధులు బాలికను నగ్నంగా చేసి తరువాత అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించి ఆమె తల్లి మీద దాడి చేసి 8 సంవత్సరాల బాలుడిని హత్య చేసి పరారైనారు. బాలిక, ఆమె తల్లికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. పోలీసులు హంతకుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

దళిత కుటుంబం

దళిత కుటుంబం

విల్లుపురం జిల్లాలోని వెల్లుపురం గ్రామంలోని ఫాం హోస్ సమీపంలోని ఇంటిలో గీతా (45 పేరు మార్చాం) అనే మహిళ కుమార్తె (14), కుమారుడు (8)తో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త చనిపోవడంతో గీతా వ్యవసాయం చేస్తూ బిడ్డలను పోషించుకుంటున్నది.

ప్రభుత్వ పాఠశాల

ప్రభుత్వ పాఠశాల

గీతా కుమార్తె దేవనూరులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గీతా కుమారుడు వెల్లుపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. తల్లి గీతాకు కుమార్తె, కుమారుడు వ్యవసాయం పనులల్లో సహాయం చేస్తున్నారు.

స్థానికులకు అనుమానం

స్థానికులకు అనుమానం

గీతా, ఆమె కుమార్తె, కుమారుడు గురువారం రాత్రిపొద్దుపోయే వరకూ ఇంటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. రాత్రి గ్రామస్తులు గీతా వ్యవసాయ పోలం దగ్గరకు వెళ్లి చూడగా షాక్ కు గురైనారు.

బాలిక నగ్నంగా

బాలిక నగ్నంగా

గీతా, ఆమె కుమార్తె తీవ్రగాయాలై పడి ఉన్న విషయం గుర్తించారు. గీతా కుమార్తె నగ్నంగా ఉంది. గీతా కుమారుడు హత్యకు గురైనాడని గుర్తించిన స్థానికులు అరకనందళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గీతా, ఆమె కుమార్తెను తిరుకోయిళూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 బాలికపై అత్యాచారం !

బాలికపై అత్యాచారం !

బాలిక పూర్తిగా నగ్నంగా ఉందని, బాలికతో పాటు ఆమె తల్లి మీద దాడి చేసి ఆమె బట్టలులాగేసి ఉన్నారని, అత్యాచారం జరిగి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గీతా కుమారుడి మృతదేహాం విల్లుపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.

స్థానికుల ఆందోళన

స్థానికుల ఆందోళన

దళిత కుటుంబ సభ్యుల మీద దాడి చేసి బాలుడిని హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చెయ్యాలని స్థానికులు ఆందోళనకు దిగారు. అరకనందళూరు పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ లు జయవేల్, రతనిసభాపతి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.

English summary
An eight-year-old Dalit boy was allegedly beaten to death while his 14-year-old old sister and mother were critically injured, in what seems to have been an attempt to rape the schoolgirl in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X