టోల్ ఫీజు అడిగితే చితకబాదారు,పోలీసులిలా..
టోల్ పీజు అడిగినందుకు టోల్ ఫ్లాజాలో పనిచేసే యువకుడిని చితకబాదారు.గురుగ్రామ్ బ్లాక్ సమితి చైర్మెన్ హోషియార్ సింగ్ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సిసి కెమెరాలోని దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసు
న్యూఢిల్లీ:టోల్ ఛార్జీని చెల్లించాలని అడిగినందుకుగాను అందులో పనిచేసే వ్యక్తిని చితక్కొట్టారు గురుగ్రామ్ బ్లాక్ సమితి మాజీ చైర్మెన్ హెషియార్ సింగ్.ఈ ఘటన గురుగ్రామ్ లో చోటుచేసుకొంది.
గురుగ్రామ్ బ్లాక్ సమితి మాజీ చైర్మెన్ హోషియార్ సింగ్ శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఓ కారులో వెళ్తుా ఖైద్కీ దౌలా ప్లాజాను సమీపించాడు.
ఆ సమయంలో ఆయనను టోల్ ఫీజు చెల్లించాలని టోల్ ఫ్లాజాలో పనిచేసే యువకుడు అక్షయ్ అడిగాడు.అయితే తననే టోల్ పీజు చెల్లించాలని అడిగాడు.
అయితే తననే టోల్ ఫీజు చెల్లించాలని అడుగుతావా అంటూ హోషియార్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కారులో నుండి వేగంగా దిగి అక్షయ్ పై దాడి చేశారు.
అంతేకాదు టోల్ ప్లాజాలోని కంప్యూటర్ , ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.అయితే ఈ దాడికి చెందిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే సిసి కెమెరాల్లో ఉన్న దృశ్యాల ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు.