అయోధ్య వివాదాన్ని తేల్చేస్తాం... నెలరోజుల్లో వాదనలు పూర్తి చేయండి : రంజన్ గోగోయ్
అక్టోబర్ 18లోగా అయోధ్య కేసుకు సంబంధించి వాదనలు పూర్తి చేయాలని చీఫ్ జస్టీస్ రంజన్ గోగోయ్ డెడ్లైన్ విధించారు. ఈమేరకు వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్స్కు ఆదేశాలు జారిచేశారు. అవసరమైతే రోజు గంటపాటు అదనంగా వాదనలు వినిపించడంతోపాటు వారంతాల్లో కూడ వాదనలు కొనసాగించి, వీలైనంత త్వరలో సమస్యకు పరిష్కారం చూపించాలని ఆయన సూచించారు.
అయోధ్య భూవివాదం కేసు గత 26 రోజులుగా రోజువారి విచారణ జరగుతున్న విషయం తెలిసిందే. ఈ నేనపథ్యంలోనే రోజువారి వాదనలకు సంబంధించి న్యాయవాదులు తమ షెడ్యూల్ను కోర్టుకు సమర్పించారు. దీంతో చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ చివరి స్పందించారు.
విచారణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలోనే వీలైనంత త్వరగా కేసును పూర్తి చేసేందుకు సహకరించానలి ఆయన కోరారు. మరోవైపు వివాదానికి సంబంధించి పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కమిటీతో కూడ పిటిషన్ దారులు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇక చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం వాదనలు వింటున్నారు.