అయోధ్య తుది తీర్పు: యూపీలో స్కూళ్లు, కాలేజీలు బంద్.. ధర్మశాలలు కూడా క్లోజ్
అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుండటంతో ఉత్తర్ ప్రదేశ్లో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. తీర్పు నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. రహదారులపై కూడా గుమికూడి ఉండొద్దని స్పష్టంచేశారు. 144 సెక్షన్ విధించినట్టు పేర్కొన్నారు.
మరోవైపు అయోధ్యలో కూడా భారీగా పోలీసు బలగాలను మొహరించారు. వివాదాస్పద స్థలం కూడా నీఘానీడలో ఉంది. ఇప్పటికే ధర్మశాలలో ఉంటున్న వారని తరలించారు. తీర్పు వెలువడ్డాక పరిస్థితిని బట్టి తిరిగి చేర్చుకుంటామని తెలిపారు.
అయోధ్య భూ వివాదం గత కొన్నేళ్లుగా సాగుతుంది. దీనిపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చాలా పిటిషనర్లు ఇంప్లీడ్ అయ్యారు. భూ వివాదా పరిష్కారం కోసం కమిటీని కూడా నియమించారు.
తర్వాత 40 రోజులపాటు సుప్రీంకోర్టు వాదనలు అలకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో తీర్పు వెలువరిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు 9వ తేదీన శనివారం తీర్పునిస్తామని స్పష్టంచేసింది.