ముస్లింలు ప్రార్థనలు చేస్తే... అది వారి స్యంతం అవుతుందా... అయోధ్య వివాదంపై సుప్రింలో వాదనలు
అయోధ్యలో ముస్లింలు ప్రార్ధనలు చేసినంత మాత్రనా ఆ ప్రాంతం తమదని చెప్పే హక్కు లేదని సుప్రిం కోర్టులో రాంలాలా తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ స్పష్టం చేశారు. ఈనేపథ్యలంలోనే ముస్లింలు వీధుల్లో నమాజు చేస్తే అది వారి స్వంతం అవుతుందా అంటు ప్రశ్నించారు. అయోధ్య నిర్మాణానికి సంబంధించి మూల అంశాలు, దాని నిర్మాణంలో దాగి ఉన్న స్ట్రక్చర్ అంతా కూడ హిందు మతానికి చెందినవిగా ఉన్నాయని ఆయన వివరించారు.
గత కొద్ది రోజులుగా అయోధ్య వివాదంపై రోజువారి విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో ఉన్న అయిదుగురు జడ్డీల బృందానికి వివరించారు. కాగా అయోధ్య నిర్మాణం ఎప్పుడు నిజమైన మసీదు స్ట్రక్ఛర్లో లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణం లోపలి బాగాలు కూడ ఇస్లాం మతానికి విరుద్దంగా ఉన్నాయని తెలిపారు. కాగా ఆర్కియాలజీ ద్వార తవ్వకాల్లో బయటపడిన నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను ఆయన న్యాయమూర్తుల బృందానికి అందించారు.
ఇక రామ మందిర శిధిలాలపై మసీదు నిర్మించారని ,దీంతో వివాస్ఫద భూమి ఎవ్వరికి చెందింది కాదని చెప్పడం తప్పని ఆయన వాదించారు.ఇక ఆలయ శిధిలాల పైన మసీదును నిర్మించడం ముస్లిం షరియత్ చట్టాలకు విరుద్దమని పేర్కోన్నారు.అయోధ్యలో ఆయలయం కూల్చివేయడం వెనుక రెండు వర్షన్లు ఉన్నాయని ఆయన తెలిపారు.మొఘల్ చక్రవర్తులైన బాబార్ లేదా ఓఔరంగజేబు కూల్చినట్టుగా చెబుతున్నారని మొత్తం మీద మందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారని అన్నారు.