వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై తీర్పు: సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసిన నిర్మోహి అఖాడా

|
Google Oneindia TeluguNews

చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో క్రమంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇఛ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ హిందు మహాసభ రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించుకున్న కొద్దిరోజుల్లోనే మరో హిందూ పార్టీ.. నిర్మోహి అఖాడా కూడా అదే బాటలో నడిచింది. బుధవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసింది. దీనితో అయోధ్య తీర్పుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో 12 రివ్యూ పిటీషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది.

అయోధ్యపై తీర్పులో షాకింగ్ ట్విస్ట్: తీర్పును వ్యతిరేకంగా హిందు మహాసభ రివ్యూ పిటీషన్..!అయోధ్యపై తీర్పులో షాకింగ్ ట్విస్ట్: తీర్పును వ్యతిరేకంగా హిందు మహాసభ రివ్యూ పిటీషన్..!

 అయోధ్యపై తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ..

అయోధ్యపై తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ..

తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసినట్లు నిర్మోహి అఖాడా అధికార ప్రతినిధి కార్తీక్ చోప్రా వెల్లడించారు. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించినట్లు తెలిపారు. ఏ కారణంతో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అందులో పొందుపరిచిన విషయాలను తెలియజేయడానికి నిరాకరించారు. రామజన్మభూమి ట్రస్టులో నిర్మోహి అఖాడాకా భాగస్వామ్యం కల్పించేలా చేయాలని కోరుతూ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

నిర్మోహి అఖాడా సైతం కేసు కోసం పోరాడినా..

నిర్మోహి అఖాడా సైతం కేసు కోసం పోరాడినా..


అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో హిందూ పార్టీల తరపున నిర్మోహి అఖాడా సైతం పోరాడిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని తమకు కేటాయించాలని కోరుతూ నిర్మోహి అఖాడా సుప్రీంకోర్టులో పోరు సాగించింది. కిందటి నెల 9వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మాత్రం అఖాడాకు వ్యతిరేకంగా వచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ్ లల్లా విరాజ్ మాన్ కు మాత్రమే చెందుతుందని తీర్పు ఇచ్చింది.

ముస్లింలకు స్థలాన్ని ఇవ్వడానికి వ్యతిరేకిస్తోన్న హిందు మహాసభ

ముస్లింలకు స్థలాన్ని ఇవ్వడానికి వ్యతిరేకిస్తోన్న హిందు మహాసభ


ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపుపై అభ్యంతరం.. ముస్లిం పార్టీలకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని నిరసిస్తూ హిందూ మహాసభ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. న్యాయపరంగా, చట్టపరంగా వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతున్నప్పుడు.. ముస్లింలకు అయిదు ఎకరాలను ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీన్ని వెనక్కి తీసుకోవాలని తాము సుప్రీంకోర్టును కోరున్నట్లు హిందు మహాసభ తరఫు న్యాయవాది విష్ణుకుమార్ జైన్ తెలిపారు.

English summary
The Nirmohi Akhara has filed a review petition against the Supreme Court's verdict in the Ayodhya title suit, bringing the total number of such petitions to 12. The Nirmohi Akhara was one of the main litigants in the Ayodhya case, but its claim to the disputed plot of land, the former site of the Babri Masjid, was dismissed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X