నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు జాగ్రత్త, రాత్రి ఎమ్మెల్యేలకు ఫోన్లు!
బెంగళూరు: కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప రాత్రిపూట జేడీఎస్ శాసన సభ్యులకు ఫోన్ చేసి మా పార్టీలోకి వచ్చేయాలని, మంత్రి పదవి ఇస్తామని బేరాలు పెడుతున్నారని, అధికారం తన చేతిలో ఉందనే విషయం ఆయన మరచిపోయారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలో మాత్రమే మీరు అధికారంలో ఉన్నారని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభఉత్వం ఉన్న విషయం మీరు మరిచిపోకూడదని బీఎస్. యడ్యూరప్ప కౌంటర్ ఇచ్చారు.
రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు, సిద్దూతో భేటీ, ఆపరేషన్ కమల, రిసార్టుకు ఎమ్మెల్యేలు!
గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఒకరు మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే పరిస్థితి వేరుగా ఉంటుందని సీఎం. హెచ్.డి. కుమారస్వామి బీజేపీ నాయకులను నేరుగా హెచ్చరించారు.
ఎమ్మెల్యేలతో డీల్
బుధవారం రాత్రి నాగమంగల జేడీఎస్ పార్టీ శాసన సభ్యుడు సురేష్ గౌడకు ఫోన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప 18 మంది ఎమ్మెల్యేలు రిసార్టుకు వెలుతున్నారని, మీరు కూడా మాకు మద్దతు ఇస్తే మంత్రి పదవి ఇస్తానని భేరం పెట్టారని ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి గాలం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివళ్ళికి ఫోన్ చేసిన యడ్యూరప్స 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి రిసార్టుకు రావాలని ఆహ్వానించారని కుమారస్వామి ఆరోపించారు. ఇలా ఎమ్మెల్యేలకు గాలం వేసి దొడ్డిదారిలో ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తే తాను చూస్తూ ఉండనని సీఎం. హెచ్.డి. కుమారస్వామి హెచ్చరించారు.
నోరు అదుపులో ఉండాలి
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని, తన చేతిలో అధికారం ఉన్న విషయం మరిచిపోయి మాట్లాడితే ఏం చెయ్యాలో అది చేస్తానని బీఎస్. యడ్యూరప్పను ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి హెచ్చరించారు. ఆపరేషన్ కమల అనే చెడు ఆలోచన పక్కన పెడితే మీకే మంచిందని హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
ప్రధాని మోడీ ఉన్నారు
కర్ణాటకలో మాత్రమే హెచ్.డి. కుమారస్వామికి అధికారం ఉందని, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న విషయం వారు మరిచిపోయారని బీఎస్. యడ్యూరప్ప కౌంటర్ ఇచ్చాడు. కుమారస్వామి చేస్తున్న బుడ్డబెదిరింపులకు బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్దంగా లేరని యడ్యూరప్ప అన్నారు.
మీ చరిత్ర ప్రజలకు తెలుసు
తన
మీద
ఎలాంటి
కేసులు
పెండింగ్
లో
లేవని,
గతంలో
నమోదు
అయినవి
అన్ని
తప్పుడు
కేసులు
అని
వెలుగు
చూసిందని
బీఎస్.
యడ్యూరప్ప
అన్నారు.
దేవేగౌడ
కుటుంబ
సభ్యుల
మీద
సుప్రీం
కోర్టులో
కేసులు
విచారణలో
ఉన్నాయని,
డినోటిఫికేషన్
కేసులు
నమోదు
అయ్యాయని,
వారి
చరిత్ర
ప్రజలకు
తెలుసని
బీఎస్.
యడ్యూరప్ప
మండిపడ్డారు.