శ్రీరాములు దెబ్బకు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి విలవిల, విజయం దిశగా బళ్లారి బీజేపీ ఎంపీ!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ దూసుకుపోతుంది. కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాలపైకి 222 శాసన సభ నియోజక వర్గాల్లో మే 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. 2018 శాసన సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠకు తెరపడటానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది.
విజేతలు ఎవరు !
బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చేసిన ప్రయత్నాల ఫలితాలు నేటితో తేలిపోనున్నాయి. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో మొత్తం 2, 622 మంది పోటీ చేశారు. 2, 405 మంది పురుషులు, 217 మంది మహిళలు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు.
Recommended Video
శ్రీరాములు
బీజేపీ నుంచి 222 మంది, కాంగ్రెస్ నుంచి 220 మంది, జేడీఎస్ నుంచి 199 మంది, బీఎస్పీ నుంచి 18మంది, ఇతరులు 1,963 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేసిన విషయం తెలిసిందే.
శ్రీరాములు దూకుడు
మాళకాల్మూరు శాసన సభ్యుడు, బిజేపీ రెబల్ అభ్యర్థి తిప్పేస్వామి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ యోగేష్ బాబును వెనక్కినెట్టిన బళ్లారి బీజేపీ ఎంపీ. శ్రీరాములు అధిక ఓట్లతో ముందుకు దూసుకుపోతున్నారు. మాళకాల్మూరులో బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములు విజయం దిశగా దూసుకుపోతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే పై శ్రీరాములు
మాళకాల్మూరులో
బీజేపీ
అభ్యర్థి
శ్రీరాములుకు
14,
459
ఓట్లు,
కాంగ్రెస్
పార్టీ
అభ్యర్థి
డాక్టర్
యోగేష్
బాబుకు
7,
244
ఓట్లు,
బీజేపీ
రెబల్
అభ్యర్థి,
సిట్టింగ్
ఎమ్మెల్యే
తిప్పేస్వామికి
3,
512
ఓట్లు
వచ్చాయి.
మాళకాల్మూరు
శాసన
సభ
నియోజక
వర్గంలో
బీజేపీ
అభ్యర్థి
బి.
శ్రీరాములు
విజయం
దిశగా
దూసుకుపోతున్నారు.