వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.15కే బాబా రాందేవ్ పతంజలి ఆటా నూడుల్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్ ఆటా నూడుల్స్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మాట్లాడుతూ తమ నూడుల్స్‌లో సీసం, మోనో సోడియం, గ్లూటామెట్ వంటి ప్రమాదకర పదార్థాలు లేవని ప్రకటించారు.

ఒక్కో ప్యాకెట్ ధర రూ. 15గా నిర్ధారించారు. ఈ నూడుల్స్‌ను దేశ వ్యాప్తంగా మూడు లక్షల దుకాణాల్లో విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆటా న్యూడుల్స్‌తో పాటు పతంజలి గ్రూప్‌ హెల్త్ డ్రింక్స్ తయారు చేయాలని యోచిస్తోంది.

కాంప్లాన్, బోర్న్‌వీటా వంటి డ్రింక్‌లకు ప్రత్యామ్నాయంగా పవర్ వీటా పేరుతో డ్రింక్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. కాగా బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఇప్పటికే ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తులు, పళ్ల రసాలను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

2014 సంవత్సరానికి గాను పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సంస్ధ రూ. 1200 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. 2015 సంవత్సరానికి గాను రూ. 2000 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది.

ఇప్పటికే ఈ ఆటా నూడుల్స్‌ను తిన్న వారు సోషల్ మీడియాలో 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అంటూ తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఇక మార్కెట్‌లోని పలు రకాలైన నూడుల్స్‌లో మోతాదుకు మించిన సీసం, ఇతర రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో దేశ వ్యాప్తంగా వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

English summary
Yoga guru Baba Ramdev on Monday launched the much anticipated Patanjali Atta Noodles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X