వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య వివాదం: సున్ని వక్ఫ్ బోర్డుపై ప్రధాని మోడీ ప్రశంసలు, ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

\న్యూఢిల్లీ: అయోధ్య వివాదం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొనడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ సందర్భంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అభినందనలు తెలిపారు. వక్ఫ్ బోర్డ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించారు.

2019 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ కేసు విచారణను వాయిదా వేయాలంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో వాదన వినిపించడంపై సున్నీ వక్ఫ్ బోర్డు బుధవారంనాడు స్పందించింది. ఆయన వాదన సరైంది కాదని పేర్కొంది.

 Babri Masjid case: Modi lauds Sunni Waqf Board for diassociating with Sibal

'కపిల్ సిబాల్ మా న్యాయవాదే. అయితే ఆయన ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. కేసు విచారణను ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ వాయిదా వేయాలన్న ఆయన వాదనతో మేము ఏకీభవించడం లేదు. సాధ్యమైనంత త్వరలో ఓ పరిష్కారం కావాలనే మేము కోరుకుంటున్నాం' అని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి హాజీ మెహ్‌బూబ్ బుధవారం స్పష్టం చేశారు.

ఆ తర్వాత కొద్ది సేపటికే మోడీ స్పందిస్తూ.. సున్నీ వక్ఫ్ బోర్డు వైఖరిని అభినందించారు. ఇప్పటికే కపిల్ సిబాల్ కాంగ్రెస్ ఏజెంట్ అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Prime Minister Narendra Modi on Wednesday lauded the Sunni Waqf Board for distancing itself from their counsel Kapil Sibal's submission that Babri Masjid case be deffered till 2019 Lok Sabha elections as it may inluence the polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X