ఆకాశంలో కేంద్రమంత్రి ప్రేమాయణం: ఎయిర్హోస్టెస్తో పెళ్లి
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో పెళ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకొని.. కొత్త జీవితాన్ని ఆరంభించాడు. మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన వేడుకలో తాను ప్రేమించిన ఎయిర్ హోస్టెస్ రచనా శర్మను వివాహమాడాడు.
ఈ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. విమాన ప్రయాణంలో భాగంగా ఎయిర్ హోస్టెస్గా పని చేస్తున్న రచనను తొలి చూపులోనే సుప్రియో ఇష్టపడ్డాడు.
చాలాకాలం పాటు ప్రేమికులుగానే ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. రచన ఢిల్లీకి చెందిన జెట్ ఎయిర్ వేస్ ఎయిర్ హోస్టెస్.
ప్రేమాయణం ఇలా...
వీరి ప్రేమాయణం ఓ సినిమాలా ఉంటుంది. కేంద్రమంత్రి సుప్రియో బబూల్ ఓసారి కోల్కతా నుంచి ముంబైకి విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో బబూల్ ఎయిర్ హోస్టెస్తో మాట్లాడారు. వారి మధ్య మాటలు కలిశాయి. తర్వాత మనసులు కలిశాయి. ఈ ఏడాది జూన్ నెలలో బబూల్.. రచనతో తన ప్రేమను వెల్లడించారు.